కేంద్ర మంత్రిగా ఫుల్ మార్కులు కొట్టేసిన రామ్మోహన్ నాయుడు సంచలనంగా మారారు. ఏరో ఇండియా 2025లో భాగంగా ఆయన యుద్ద విమానాన్ని నడిపారు. జీవితంలో మరిచి పోలేని అనుభూతి అని పేర్కొన్నారు. హెజ్ జేటీ 36 యశస్ జెట్ విమానంలో ప్రయాణించే ఛాన్స్ దక్కిందన్నారు. ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎక్స్ లో ఫోటోలు పంచుకున్నారు.