కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్ ల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతోందన్నారు మంత్రి కందుల దుర్గేష్. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి కాటతో కలిసి పాల్గొన్నారు. సింహాచలం ఆలయ అభివృద్ది పనులు 60 శాతం పూర్తయ్యాయని, అన్నవరం దేవాలయ అభివృద్దికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పనులు నిలిచి పోయాయని వెల్లడించారు.