తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్లకు సోకిందని, దీంతో కొన్ని రోజుల పాటు చికెన్ ఎవరూ తినవద్దంటూ హెచ్చరించింది ప్రజలను. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వ్యాపించడంతో అలర్ట్ అయ్యాయి ప్రభుత్వాలు. జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించాయి.