ఎమ్మెల్సీ ఎన్నికలకు 100కు పైగా నామినేషన్లు
NEWS Feb 10,2025 01:08 pm
తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ దాఖలుకు ఇవాల్టితో గడువు ముగిసింది. 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 14న విత్ డ్రాకు చివరి గడువు. 27న పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్లను లెక్కిస్తారు. ఆరోజే ఫలితాలు వెల్లడిస్తారు. మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు, నల్గొండ - వరంగల్ - ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్ దూరంగా ఉండగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.