సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో బీఆర్ఎస్ రైతు ధర్నా చేపట్టనుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కానున్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇవ్వాలని , సన్న వడ్లు అమ్మిన రైతులకు బోనస్ చెల్లించాలనే డిమాండ్లతో ఈ ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. పోలీసులు భారీగా మోహరించారు.