ఆర్టీసీ సమ్మె నోటీసులపై చర్చలు
NEWS Feb 10,2025 05:26 am
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు యాజమాన్యానికి. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, పని గంటలు తగ్గించాలని, ఎండీ సజ్జనార్ ను బదిలీ చేయాలని, వేధింపులు ఆపాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని తదితర 21 అంశాలతో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్మిక శాఖ ఆర్టీసీ జేఏసీ నేతలు, యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు సిద్దమైంది. 4 గంటలకు కీలక సమావేశం కానుంది.