తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ పై వేటు వేసింది జనసేన పార్టీ హైకమాండ్. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. గత కొన్ని రోజులుగా తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై విచారించి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ నుంచి దూరం పెడుతున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.