విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేత
NEWS Feb 09,2025 09:04 am
మలబార్ గోల్డ్, డైమండ్స్ వరంగల్ షోరూం మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ములుగు నియోజకవర్గ విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర హాజరయ్యారు. విద్య, ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన వంటి సామాజిక సేవలు చేస్తున్న చారిటబుల్ ట్రస్ట్ ను మంత్రి సీతక్క అభినందించారు. స్కాలర్షిప్ తీసుకున్న ప్రతి విద్యార్థినులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ కోరారు.