శ్రీ పరదేశమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
NEWS Feb 09,2025 06:10 am
చిట్టియ్య పాలెం గ్రామంలో ఈనెల 10న శ్రీ పరదేశమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జగన్ వెల్లడించారు . ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు . విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ , పంచమి బహుమతులుగా రూ . 10 వేలు, రూ.8 వేలు, రూ. 6 వేలు, రూ. 4 వేలు, రూ. 2 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. అదే రోజు రాత్రి 7 గంటలకు కరుణ ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో డాన్స్ బేబీ డాన్స్ ప్రదర్శన ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.