హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు హత్యకు గురయ్యాడు. సొంత మనవడే తనను హత్య చేయడం కలకలం రేపింది. ఇటీవల కంపెనీలో మరో మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు జనార్దన్ రావు. తనకు కూడా డైరెక్టర్ పదవి కావాలని పట్టు పట్టాడు కీర్తి తేజ. చెడు వ్యసనాలకు బానిసైన తనకు ఇవ్వక పోవడంతో తాతను చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.