జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
NEWS Feb 08,2025 05:08 pm
మెట్పల్లి మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముత్తయ్య రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో దాదాపు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో మెరిట్ సాధించిన 25 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు చెప్పారు. పీఈటీలు అంజయ్య, కార్తీక్, శ్రీలత, రవళి, జ్ఞానేశ్వర్ ఉన్నారు.