దేశప్రజలు మోదీ పాలన కోరుకొంటున్నారని ఆత్రేయపురం బీజేపీ నాయకులు చేకూరి రమేష్ వర్మ, గూడవల్లి రాంబాబు పేర్కొన్నారు. శనివారం వారు మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పై వారు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు ఆప్ను చీపురుతో ఊడ్చేసారని అన్నారు. బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలే బీజేపీకి అండగా ఉన్నారన్నారు. బీజేపీతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.