ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆప్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా కూటమిలో ఉంటూ స్వంతంగా పోటీ చేయడం వల్లే ఆప్ కు ఈ దుస్థితి దాపురించిందన్నారు. లిక్కర్ స్కాంలో పీకల లోతుకు కూరుకు పోవడం ఆప్ ఓటమికా కారణమంటూ పేర్కొన్నారు. తమ పార్టీకి ఓటు శాతం పెరిగిందన్నారు .