ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆప్ కు షాక్ ఇచ్చాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు పరాజయం పొందారు. ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా కేజ్రీవాల్ బాట పట్టారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు కేజ్రీవాల్ పై. తనపై దాడి చేసినందుకు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పారంటూ పేర్కొన్నారు.