ములుగు జిల్లాలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి పర్యటన
NEWS Feb 08,2025 10:47 am
ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం మండలాల్లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు శనివారం పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన ఆయా మండలాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, క్రీడా కళాశాలలు, ఐటీఐ, జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ విద్యాసంస్థల్లో అనేక సమస్యలున్నాయని, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.