ఢిల్లీ శాసన సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ పవర్ లోకి రావడంతో కమలం శ్రేణులు సంబురాల్లో మునిగి పోయాయి. ఈ సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ గెలుపు మోదీ సమర్థవంతమైన నాయకత్వానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీయే కూటమి దేశ వ్యాప్తంగా ఇదే విజయాన్ని నమోదు చేస్తుందన్నారు.