ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రిలో ముకునూర్ తుపాకులగూడెం కు చెందిన ఓ మహిళ అనారోగ్యం తో ఏటూరునాగారం హాస్పిటల్ రాగా, వైద్యులు పరీక్ష లు నిర్వహించి రక్తం చాలా తక్కువగా ఉంది వెంటనే రక్తం ఎక్కించుకోవాలని సూచించారు.ఈ విషయం తెలుసుకున్న ఏటూరునాగారం పోలీస్ కానిస్టేబుల్ అజయ్ ( A పాజిటివ్ ) రక్తదానం చేసి ప్రాణదాత అయ్యారు. ఆపదలో ఉన్న మహిళకు రక్తదానం చేసిన అజయ్ ని ఏటూరునాగారం SI తాజోద్దిన్ అభినందించారు.