ఢిల్లీలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా గంగాధర మండలం గంగాధర చౌరస్తాలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పంజాల ప్రశాంత్ మాట్లాడుతూ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతో ఢిల్లీ ప్రజలు బీజేపీకి అపూర్వ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.