ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి సీతక్కను కలిసిన సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు. తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన మంత్రి సర్వ శిక్ష అభియాన్ డైరెక్టర్ ను చేరవాణిలో సంప్రదించి ఉద్యోగులు దీక్షలో ఉన్నా సమయంలో వేతనంతో పాటు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని,నాన్ ఫైనాన్స్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.