పార్టీ నియమాలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ అధిష్టానం మరోసారి స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేత సుభాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. గత అక్టోబరులో ఓ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహను, పార్టీని దూషించినందుకు పార్టీ అధిష్టానం సీరియస్గా పరిగణించి, చర్యలకు ఉపక్రమించింది. నవంబర్ 21నాటికి సమాధానం ఇవ్వాల్సిందిగా సుభాష్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చారు .