టీపీసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత సుభాష్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై సుభాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.