పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అడ్మిషన్ బిల్డింగ్ ను ముట్టడించడంతో ఉద్రిక్తత నెలకొంది. నెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చీకటి పడినా విద్యార్థులు ఆందోళన విరమించలేదు. డిన్నర్ ను కూడా బహిష్కరించారు. వీసీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.