ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 12న మోడీతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఉంటారని కేంద్రం తెలిపింది. యుఎస్ నూతన అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక తొలిసారిగా పీఎం పర్యటించనున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రత్యేకించి అక్రమ వలసదారుల సమస్య ప్రధానంగా మారింది. పెద్ద ఎత్తున విద్యార్థులకు బేడీలు వేసి పంపించడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది.