పేద కుటుంబానికి చేయూత
NEWS Feb 07,2025 05:25 pm
బెల్లంపల్లి పట్టణంలోని 26 వ వార్డు ఆశోక్ నగర్ బస్తికి చెందిన నిరుపేద కుటుంబ మహిళా శిరీష ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబానికి మేమున్నామని భరోసానిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందించారు బస్తివాసులు. నాయకులు చిప్ప మనోహర్ కుంభాల రాజేష్, సబ్బని సాయికుమార్, సలిం, అయిల్ల పొశం, నసీర్, జాఫర్, బద్రి,గౌస్, ఫసి, ప్రశాంత్, సాదిక్, అఫ్రోజ్, లతీఫ్, రామన్న, తదితరులు పాల్గొన్నారు.