స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి
NEWS Feb 07,2025 05:23 pm
ములుగు జిల్లా మంగపేటలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జయరాం రెడ్డి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, నాయకులకు కార్యకర్తలకు మధ్య విభేదాలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని తెలిపారు.