మంత్రివర్గ విస్తరణ వాయిదా పడిందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేతల కేసులు అరెస్టుల విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటామన్నారు. అర్జంట్ గా వాళ్ళని జైల్లో పెట్టాలని నాకు ఏమీ లేదన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కూడా కొలిక్కి వచ్చిందన్నారు. తాను ఎవరినీ సిఫార్సు చేయలేదని, మంత్రివర్గంలో ఎవరుండాలనేది హై కమాండ్ దే తుది నిర్ణయమన్నారు. పకడ్బందీగా కుల గణన చేశామన్నారు సీఎం.