బెల్లంపల్లి పట్టణంలోని జామే మసీదు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గోల్ బంగ్లా బస్తీకి చెందిన హాజీ ఎంఏ రెహమాన్. ఈ సందర్బంగా గౌసే ఆజం సొసైటీ అధ్యక్షులు ముక్తార్, తాజ్ బాబా సేవా సమితి చీఫ్ ఉస్మాన్ ఆధ్వర్యంలో రెహమాన్ ను పూలమాలలతో సన్మానించారు. శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మత గురువు సాదిక్ ఇస్లాంతో పాటు మత పెద్దలు పాల్గొని అభినందించారు.