బెల్లంపల్లిలోని జామా మసీదు కమిటీ పదవీ కాలం ముగిసింది. ఈ సందర్బంగా నూతన కమిటీని ఎన్నుకునేందు కోసం హడ్ హక్ కమిటీ, మత పెద్దల సమక్షంలో సమావేశం నిర్వహించారు. నూతన అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జామా మస్జిద్ నూతన అధ్యక్షులుగా ఎంఏ రెహమాన్ ని ఎన్నుకున్నట్లు హడాక్ కమిటీ, మత పెద్దలు ప్రకటించారు. ఈ సందర్బంగా ఎంఏ రెహమాన్ ను ఘనంగా సత్కరించారు.