తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. అక్రమ ఆస్తులు పోగేసిన వారిపై దృష్టి పెటింది. హన్మకొండలో అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి దాడులు చేపట్టింది. రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్న పుప్పాల శ్రీనివాస్ అద్దెకు ఉంటున్న ఇంటితో పాటు, జగిత్యాల, హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేస్తున్నట్టుగా సమాచారం.