మేడారం జాతరలో పూజారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నారు. రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణ పనులను ఎండోమెంట్ డీఈ రమేష్ బాబు, ఏఈ వీర చంద్ర రావు, ఈవో రాజేంద్రం పరిశీలించారు. మేడారం మహా జాతరలో పూజారులకు జాతర సమయంలో నివాసం ఉండడానికి, ప్రత్యేక పూజలు చేసుకోవడానికి ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.