ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తండేల్ సినిమా టికెట్ల పెంచాలని తాము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరలేదన్నారు. ఆ అవసరం తమకు లేదన్నారు. అంతే కాదు బెనిఫిట్ షోస్ కోసం కూడా అడగలేదన్నారు. ఏపీలో ధరలు పెంచమని అడిగామని, అది కేవలం రూ. 50 మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం అరవింద్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.