ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ -2025కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రం పాలసీలకు తగినట్టు అమరావతిలో అలాంటి సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి పార్థసారథి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ఎంఎస్ఎంఈ విధానంలో మార్పులకు ఆమోదం లభించిందని తెలిపారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఇండస్ట్రియలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ఓకే చెప్పిందన్నారు.