ఘనంగా ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం
NEWS Feb 06,2025 05:04 pm
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట అంగడి బజారులోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారి వార్షికోత్సవ పూజ అర్చకుడు గొంగళ్ళ ఉమాశంకర్,శివా చార్య నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా గణపతి పూజ, అష్ట దిక్పలక పూజ, గౌరీ పూజా, పుణ్య వచనము స్వామి వారికి మన్యు సూక్త సహిత అభిషేకం, సింధూర పూజ,మంగళ హారతి ఆశీర్వచనం జరిపించారు. పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదలు అందజేశారు. కార్యక్రమంలో గంప నాగేంద్రం పద్మ, రాము,చెన్న సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.