మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభలినందున కామారెడ్డి జిల్లాలోని కోళ్ళ పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోళ్ళ రైతులకు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి కోళ్లలో వచ్చే వివిధ వ్యాధులు ముఖ్యంగా ఏవియన్ ఇన్ఫ్లుంజ్ గూర్చి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, మహారాష్ట్ర సరహద్దున కామారెడ్డి జిల్లా ఉన్నందున అప్రమత్తంగా ఉండి పశువైద్య చర్యలు తీసుకోవలన్నారు.