బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి సన్మానం
NEWS Feb 06,2025 01:02 pm
బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా 2వసారి నియమితులైన ఏలేటి నరేందర్ రెడ్డిని గురువారం మెట్ పల్లి పట్టణంలో బీజేపీ నాయకులు సన్మానించారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తించి రెండోసారి ఆయనకు పదవి లభించడం పట్ల పలువురు ఆయనను అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొమ్ముల రాజుపాల్ రెడ్డి, మారు జనార్దన్ రెడ్డి, ఇల్లెందుల శ్రీనివాస్, శంకర్ గౌడ్, ఆకుల శ్రీనివాస్, రవీందర్, జయకృష్ణ శ్రీధర్ తదితరులున్నారు.