జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత కొత్త బస్టాండులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ మహిళ ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన డిపో మేనేజర్ ఆ మహిళకు CPR చేసి సమీప ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ బస్ భవన్లో డీఎం సునీతను సన్మానించారు. ఈ సందర్భంగా డీఎంను డిపో ఉద్యోగులు అభినందించారు.