సమాజంలో గురువుల పాత్ర వెల కట్టలేనిదని సీఐ నిరంజన్ రెడ్డి అన్నారు. మెట్పల్లి పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఆయన ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక కావడం పట్ల శాలువాతో సత్కరించారు. సీఐ మాట్లాడుతూ తాను ఈ ఉన్నతమైన స్థాయిలో ఉన్నానంటే, ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకుంటున్నానంటే గురువులే కారణమన్నారు. కార్యక్రమంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.