కోరుట్లకు చెందిన చింత చంద్రశేఖర్ తన ఇంటిలో నుండి ఒక బ్యాగులో సుమారు తులం బంగారం, ఇతర వస్తువులతో బైక్పై వెళ్తుండగా ఆ బ్యాగ్ మార్గమధ్యలో పడిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు సిసి కెమెరాలో పరిశీలించగా మున్సిపల్ సిబ్బందికి దొరికినట్లు గుర్తించారు. వారు ఆ బ్యాగును అక్కడ హోటల్ వారికి ఇచ్చినట్లు తెలుసుకొని బాధితుడికి ఎస్ఐ శ్రీకాంత్ బ్యాగును అందజేశారు.