కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పాలాభిశేఖం నిర్వహించారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో బిసి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం మాటపై నిలబడి ఉందన్నారు. అసెంబ్లీలో ఆమోదం కొరకు బీసీ కులగణన బిల్లును ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున ఆమోదం తెలిపిన సందర్భంగా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్, షబ్బీర్ అలీకి పాలాభిశేఖం చేశారు .