ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ ఆలయ ప్రాంతంలో హన్సిక అనే బాలికపై కుక్కలు దాడి చేశాయి. బాలిక ఆడుకుంటుండగా అవి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే బాలికను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.కాగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించాలని వైద్యులు సూచించారు.హన్సికతో పాటు మరో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేసినట్లు తెలిసింది. గతంలో ఆర్మూర్ లో కుక్కల దాడి కారణంగా పలువురికి గాయాలయ్యాయి.