టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ శ్రేణులకు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే పార్టీ క్రమిశిక్షణ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గంపై అనుచిత కామెంట్స్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రూల్స్ ఎవరైనా పటించాల్సిందేనని , గీత దాటితే వేటు తప్పదన్నారు.