రాష్ట్ర ప్రజానికానికి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త పిలుపునిచ్చారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి దాటవేస్తుందని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని, సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పాల్గొన్నారు.