ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీపై భగ్గుమన్నారు. మరోసారి తన నోటికి పని చెప్పారు. నాకు నోటీసులు ఇచ్చేందుకు మీరెవ్వరంటూ ప్రశ్నించారు. పార్టీ ఏమైనా మీ అయ్య జాగీరా అంటూ నిప్పులు చెరిగారు. తనకు అన్యాయం చేయాలని చూస్తే పండవెట్టి తొక్కుతా అంటూ ఫైర్ అయ్యారు. ఇది కుల సర్వే కాదు అగ్ర కుల సర్వే అంటూ నిప్పులు చెరిగారు. రెడ్డి సామాజిక వర్గంపై కామెంట్స్ చేయడంపై టీపీసీసీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.