అండర్ 19 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ క్రికెటర్ గొంగిడి త్రిషను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రాష్ట్రానికి పేరు తీసుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తన ఆటతో దేశానికి గర్వ కారణంగా నిలిచిన త్రిషకు రూ. కోటి నజరానా ప్రకటించారు సీఎం.