ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభం
NEWS Feb 05,2025 02:21 pm
పశు సంవర్దక శాఖ , పశు వైద్య కాలేజీ కోరుట్ల సంయుక్త ఆధ్వర్యంలో మెట్ పల్లి నియోజకవర్గంలోని చౌలమద్ది గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మెట్ పల్లి మండల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.బక్కయ్య, కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ శకారం ,డాక్టర్ అంబిక , డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7 ఆవులు, 32 గేదెలకు చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధి చికిత్సలు, దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ,అలాగే గొర్రెలు, మేకలలో పోచమ్మ వ్యాధి నివారణ టీకాలు ఇచ్చారు.