పోలీసులకు చిక్కిన పేకాట రాయుళ్లు
NEWS Feb 05,2025 08:01 am
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పీసీ భోజన్న ఫామ్ హౌస్ ప్రక్కన గల నిజాంసాగర్ కెనాల్ కట్టపైన పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ పేకాట స్థావరంలో ఆరుగురు పేకాటరాయుళ్లతో పాటు, 4 మొబైల్ ఫోన్లను, 4 బైకులను, 21,960 రూపాయల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం పేకాట స్థావరంలో పట్టుబడిన ఆరుగురు పేకాట రాయుళ్లను ఆర్మూర్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.