మెట్ పల్లి పట్టణంలో పేరిణి నృత్యం పోటీలలో అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు శ్రీ సూర్యోదయ హైస్కూల్ విద్యార్థులు. ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ విజయ కుమారి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కు సంబంధించి మెమొంటోలను బహూకరించారు. తమ పాఠశాల విద్యార్థులు అరుదైన ఘనత సాధించారని, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.