ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం పొందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సర్కార్ చేపట్టిన సర్వే దేశానికే ఆదర్శమన్నారు. దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నారు. ఎస్సీలకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందన్నారు. దామాషా ప్రకారం స్థానిక ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలని కోరారు.