సమిష్టి కృషి తోనే రాష్ట్రానికి మేలు
NEWS Feb 05,2025 04:10 am
కలిసికట్టుగా ఉండటం వల్లే విశాఖ స్టీల్ ను కాపాడు కోగలిగామన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సమిష్టి కృషితో విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కు నిధులు తెచ్చుకోగలిగామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని లోకేష్ అభినందించారు.