తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మాడ వీధుల్లో అమ్మ వారు ఊరేగారు. సూర్య ప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. సిరులతల్లి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మ వారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులను అనుగ్రహించారు.